calender_icon.png 19 October, 2024 | 3:00 AM

ఐదో స్థానానికి భారత్

23-07-2024 12:05:00 AM

కొవిడ్19 మహమ్మారి తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని ఆర్థిక సర్వే పేర్కొంది.2024 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ 2020 ఆర్థిక సంవత్సరంకంటే 20 శాతం ఎక్కువని తెలిపింది. వాతా వరణ ప్రమాదాలకు లోబడి 2025 ఆర్థిక సంవత్సరంలో బలమైన వృద్ధిని కొనసాగించే అవకాశాలు బాగానే ఉన్నాయని అభి ప్రాయపడింది. ప్రైవేటు క్యాపిటల్ మార్కెట్ బలంగా ఉందని, 2024లో దీనిద్వారా రూ.10.9 లక్షల కోట్ల మూలధనం సమీకరించబడిందని తెలిపింది. ఈ క్రమంలో జీడీపీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ నిష్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరుకుంది.