కాన్పూర్: టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో ఇరుజట్లు తమ ప్రాక్టీస్లో జోరును పెంచాయి. బుధవారం భారత్, బంగ్లా ఆటగాళ్లు గంటల తరబడి నెట్స్లో సాధన చేశారు. ఇక కాన్పూ ర్ పిచ్ తొలి రెండు రోజులు పేసర్లకు.. చివరి మూడు రోజుల స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. తొలి టెస్టులో భారత్ 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.