calender_icon.png 29 September, 2024 | 4:58 PM

ఆధిక్యంలో ఇండియా-ఏ, ఇండియా-డి

22-09-2024 12:00:00 AM

దులీప్ ట్రోఫీ

అనంతపురం: దులీప్ ట్రోఫీ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఇండియా-ఏ, ఇండియా-డి జట్లు ఆధిక్యం దిశగా సాగుతు న్నాయి. ఇండియా-బితో మ్యాచ్‌లో మూ డో రోజు ఆట ముగిసే సరికి ఇండియా-డి జట్టు 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.  రికీ భుయ్ (90 నాటౌట్) సెంచ రీ దిశగా సాగుతున్నాడు. ముకేశ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన శ్రేయస్ అయ్యర్ ఫిఫ్టీతో మెరిశాడు. ప్రస్తుతం ఇండియా-డి 311పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఇండి యా-సితో మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు 333 పరుగుల లీడ్‌లో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-ఏ 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.