దేహశుద్ధి చేసిన మహిళలు
నాగర్కర్నూల్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): సోషల్ మీడియాలో ఓ మాజీ ప్ర జాప్రతినిధిపై అసభ్యకర పోస్టులు చేసిన మాజీ ఆర్మీ జవాన్కు మహిళలు, యువకులు చెప్పులతో దేహశుద్ధి చేశారు. ఈ ఘట న నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి మాజీ ఆర్మీ జవాన్. అదే గ్రామానికి చెందిన మాజీ ప్రతినిధి శ్రీనివాస్గౌడ్ కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టు ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో శ్రీనివాస్గౌడ్ వర్గానికి చెందిన మహిళలు, యువకులు వెంకట్రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. వెంకట్రెడ్డికి దేహశుద్ధి చేశారు.