19-03-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్. మార్చ్ 18: (విజయక్రాంతి): జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పను ల్లో వేగం పెంచాలన్నారు, జిల్లా కలెక్టర్ మంగళవారం కలె క్టరేట్ మొదటి అంతస్తులోని వీడియో కా న్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి మం డల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఏపీఓలతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జాతీ య గ్రామీణ ఉపాధి హామీ ( ఎన్ఆర్ఈజీఎస్ ) పనుల్లో వేగం పెంచి కూలీల సంఖ్య వంద శాతం హాజరయ్యే విధంగా చర్యలు తీసుకో వాలని, మార్చి 31 లోపు, జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగం గా జరుగుతున్న పనులు కాలువ పూడికతీత, చెక్ డ్యాం నిర్మాణం, ఇం కుడు గుంతలు, తదితర అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
విధులలో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు, ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థ లు) లెనిన్ వత్సాల్ టోప్పో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రాజు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ఎంపీడీవోలు ఏపీ ఓలు సం బంధిత సిబ్బంది పాల్గొన్నారు.