ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి
కామారెడ్డి/నిజామాబాద్, అక్టోబర్25 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు కాంగ్రెస్లో చేరారు. శుక్రవారం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్కుమార్ ఆధ్వర్యంలో భీంగల్ మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు ప్రేమలత, ఆమె భర్త సురేందర్.. ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
హస్తం గూటికి మోర్తాడ్ మాజీ ఎంపీపీ
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మాజీ ఎంపీపీ శివలింగ శ్రీనివాస్ శుక్రవారం బాల్కొండ ఇన్చార్జి ముత్యాల సునీల్కుమార్ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో శివలింగం శ్రీనివాస్ కాంగ్రెస్లోనే పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.