calender_icon.png 27 October, 2024 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుపతి హోటల్స్‌కు ఆగని బాంబు బెదిరింపులు

27-10-2024 12:15:35 PM

తిరుపతి: తిరుపతికి బాంబు బెదిరింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా బెదిరింపులతో తిరుమలలోని హోటల్స్ కి వచ్చిన జనాలు భయపడుతున్నారు. తాజాగా తిరుపతిలోని హోటల్స్‌కు మళ్లీ  బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఉగ్రవాదులు వరుసగా మూడోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపించారు. ఈ క్రమంలోనే జాఫర్ సాదిక్ అనే పేరుతో మరో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు హోటల్స్ యజమానులు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుపతిలోని ఓ ఆలయానికి సైతం బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.