calender_icon.png 13 February, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లిలో మిర్చి కొనుగోలు కేంద్రం ప్రారంభం

13-02-2025 08:48:10 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో సోమవారం నుంచి మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇల్లందు మార్కెట్ సెక్రటరీ నరేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో జీపు ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ అవకాశాన్ని టేకులపల్లి మండలంలోని రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలని జీపు ద్వారా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ గార్డ్ మునీర్, వై మధు పాల్గొన్నారు.