calender_icon.png 22 October, 2024 | 8:21 PM

రెండు భాగాలుగా..

19-10-2024 12:00:00 AM

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది మహేశ్ బాబు, రాజమౌళి కాంబో చిత్రం గురించే. ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తూ తెగ వైరల్ అవుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి మహేశ్‌తో సినిమాను ప్రకటించారు. అప్పటి నుంచి రకరకాల ఊహాగానాలు వినవస్తూనే ఉన్నాయి. ఇటీవల రాజమౌళి తండ్రి, చిత్రానికి కథను అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఇక తాజాగా వినిపిస్తున్న మాటేం టంటే ఈ చిత్రం రెండు భాగాలుగా తీయబోతున్నారట. బహుబలి మాదిరిగానే రెండు భాగాల్లో సినిమాను రూపొందిస్తారట.

కథకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో ఒకే పార్ట్‌లో తీయడం సాధ్యం కాదని రాజమౌళి భావిస్తున్నారట. దీంతో రెండు భాగాలుగా తెరకెక్కించాలనే యోచనలో ఉన్నారట. ప్రధాన పాత్రల్లో మార్పేమీ ఉండదు కానీ కథ, కథనాలు మాత్రం మారుతాయట. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ కథను సినిమాగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథకు తగ్గట్టుగా మహేశ్ మేకోవర్ అవుతున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో పాత్రకు తగినట్టుగా తయారవుతున్నారు. ఇక ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనున్నట్టు సమాచారం. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.