నిందితుడి అరెస్టు
గజ్వేల్, అక్టోబరు16: సింగాయ పల్లి గ్రామశివారులోని పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో దేవతా మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితుడిని గౌరారం పోలీసులు అరెస్టు చేశారు. గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి బుధవారం వివరాలను వెల్లడించారు.. సింగాయపల్లి గ్రామానికి చెందిన కొప్పొజి వెంకటస్వామి చారి మంగళవారం రాత్రి మద్యం సేవించి గ్రామశివారులో ఉన్న పెద్ద మ్మ తల్లి దేవాలయంలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను పగులగొట్టా డు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి బుధవారం ఉదయం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించాం.