calender_icon.png 21 October, 2024 | 9:22 AM

400 ఏళ్ల నాటి గుడి నేపథ్యంలో..

24-07-2024 12:00:00 AM

లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ 75వ జయంతి సందర్భంగా ఆయన స్మృతిలో మూన్‌సైన్ పిక్చర్స్ సంస్థ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ కొత్త చిత్రాన్ని చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. పరిశ్రమలో అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ‘బీబీఎస్12’ (మేకింగ్ టైటిల్) ప్రతిష్టాత్మక చిత్రం అవుతుందని, అత్యుత్తమ సాంకేతిక విలువలతో మ్యాసీవ్ స్కేల్‌లో దీన్ని రూపొందిస్తున్నామని తెలిపింది. ఈ చిత్రానికి లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మహేశ్ చందు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 400 ఏళ్ల నాటి గుడి నేపథ్యంలో  రూపొం దుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో ఆవిష్కరించనుందని అనౌన్స్ మెంట్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

సాయి శ్రీనివాస్ చేతిలో తుపాకీ పట్టుకొని గుడిని చూస్తున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ రెండో షెడ్యూల్ బుధవారం నుంచి ప్రారంభం కానుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు సమర్పణ: శివన్ రామకృష్ణ; డీవోపీ: శివేంద్ర; సంగీతం: లియోన్ జేమ్స్; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్; ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల; సహ నిర్మాత: సాయి శశాంక్; రచన లుధీర్ బైరెడ్డి.