దర్శకుడు రాసుకున్న కథని తెరమీదికి తీసుకెళ్ళే బాధ్యత కెమెరామెన్ది. కాగా వారు తెరకెక్కించిన సన్నివేశాల్లో బిగువు సడలకుండా సంగీతంతో నిలబెట్టేది సంగీత దర్శకుడు. ఈ క్రమంలో దర్శకుడు ఇద్దరితోనూ వ్యవహారాలు నడుపుతుంటాడు.
సినిమాకి సంబంధించిన ప్రచార వేడుకల్లో తప్పితే ఛాయాగ్రాహకుడు, స్వరకర్త కలిసి మామూలుగా కలసి కనపడటం అరుదు. అలాంటి అరుదైన ఘటనే తాజాగా చోటుచేసుకుంది. స్వర మాంత్రికుడు రెహమాన్, కెమెరామెన్ రత్నవేలు, దర్శకుడు బుచ్చిబాబు కలిసి ఉన్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వచ్చి చేరింది. అయితే దర్శకుడు ఫ్రేమ్లోకి వచ్చేసరికి అందరికీ విషయం అర్థమైపోయింది. బుచ్చిబాబు చరణ్ కలయికలో రూపొందనున్న సినిమా పనుల్లో భాగంగానే ఈ త్రయం కొలువుతీరిందని అభిమానులు సంబరపడుతున్నారు. దీనిని బట్టి ఆర్సీ 16 పూర్వ నిర్మాణ పనులు ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయని తెలుస్తోంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించనున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయకగా నటించనున్న సంగతి తెలిసిందే. హీరో రామ్చరణ్ ఇటీవల ‘గేమ్ చేంజర్’ చిత్రీకరణ ముగించటంతో ఆగస్టు నుంచి బుచ్చిబాబు సినిమా ఆరంభం కానుంది.