calender_icon.png 1 October, 2024 | 3:43 AM

108 నిమిషాల్లో.. 108 గణేశ్ చిత్రాలు

01-10-2024 01:52:15 AM

వీఆర్‌ఎస్ వీజే విద్యార్థుల అరుదైన ఘనత 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): వల్లూరుపల్లి రత్తయ్య సీతమ్మ విజ్ఞాన జ్యోతి రెసిడెన్సియల్ స్కూల్ (వీఆర్‌ఎస్‌వీజే)లో చదువుతున్న  విద్యార్థులు 108 నిమిషాల్లోనే 108 గణేశ్ చిత్రాలను వేసి అరుదైన రికార్డును సాధించారు. వీఆర్‌ఎస్ వీజే స్కూల్ ట్రస్టీ వల్లూరుపల్లి రమణ శ్రీ, పాఠశాల డైరెక్టర్ కొడాలి విజయరాణి సహకారంతో విశ్వగురు వరల్డ్ రికార్డ్ వ్యవస్థాపకులు రామ్ బాబు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఈ ప్రతిభను చాటారు.

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల ప్రతిభతో రూపొందిన ప్రతి గణపతి చిత్రం ప్రత్యేకతను కలిగి ఉందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్య, వ్యాపార రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.