calender_icon.png 23 September, 2024 | 4:54 PM

మట్టి గణపతికి పాలతో నిమజ్జనం

23-09-2024 12:23:07 AM

రూ.2.22లక్షలు పలికిన లడ్డు

హనుమకొండ, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): వరంగల్ ఎల్లంబజార్‌లో కొలువైన 40 అడుగుల మట్టి గణపతికి పదిహేను రో జుల అనంతరం నిర్వాహకులు ఆదివారం ఘనంగా నిమజ్జనం కార్యక్రమం  నిర్వహించారు. 15 రోజుల అనంతరం అక్కడే గణప య్యకు ఫైర్ ఇంజన్ల సాయంతో పాలతో అభిషేకం చేసి నిమజ్జనం చేశారు. వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా మండపంలో ఏర్పాటు చేసిన లడ్డూకు వేలం నిర్వహించగా రూ.2.22లక్షలకు స్థానిక వ్యాపారి దక్కించుకోవడం విశేషం.