calender_icon.png 21 September, 2024 | 1:44 PM

ఏపీలో మందు బాబులకు గుడ్ న్యూస్..

21-09-2024 11:52:55 AM

అమరావతిఏపీ లో నాణ్యమైన మద్యం అందుబాటులోకీ తీసుకువస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు దిశగా   చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది. బహుళ జాతి సంస్థలకు చెందిన బ్రండ్లు ఇప్పుడు మద్యం షాపులలో దర్శనం ఇస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం ప్రియుల ఆరోగ్యానం్ని నాశనం చేసే విభిన్న లోకల్ బ్రాండ్లను విక్రయించారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నూతన ఎక్సైజు  పాలసీ విడుదల చేసిన  ముఖ్యమంత్రి చంద్రబాబు బహుళ జాతి కంపెనీల బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మెక్ డోవెల్  విస్కీ 1 బ్రాండు 10,000 కేసుల క్వార్టర్ సీసాలు రాష్ట్రంలో విక్రయానికి సిద్ధంగా ఉన్నయని రానున్న పది రోజులలో లకస్స్ లక్ష కేసుల మద్యం విపణిలోకి రావటాని సిద్ధంగా ఉందని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మరి కొన్ని రోజుల్లో దేశ వ్యాప్తంగా దొరికే అన్ని రకాల బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. యాంటిక్విటీ, రాయల్ చాలెంజ్, వాట్ 69, బ్లాక్ డాగ్, ఓడ్కా, జానీ వాకర్ రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్ రకాలు మధ్యం షాపులలో సిద్ధంగా ఉంటాయని చెబుతున్నారు.