calender_icon.png 8 October, 2024 | 5:04 PM

మెహబూబా ముఫ్తీ కుమార్తె ఓటమి

08-10-2024 12:06:35 PM

జమ్మూకశ్మీర్,(విజయక్రాంతి): జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తీ ఓటమిని అంగికరించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత బషీర్ అహ్మద్ చేతిలో ఇల్తీజా ముఫ్తీ ఓటమి చవిచూశారు. శ్రీగుఫ్యారా-బిజ్ బెహరా నియోజకవర్గం నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) అభ్యర్థిగా ఇల్తిజా ముఫ్తీ పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు సగంలో ఉండగానే ఆమె వెనుకంజలో ఉన్నారు. దీంతో ఇల్తిజా ప్రజల తీర్పును శిరసావహిస్తున్నంటూ ట్వీట్ చేశారు. బిజ్ బెహరాలో ప్రజల నుంచి తను పొందిన ప్రేమ, ఆప్యాయత ఎల్లప్పుడూ తనాతోను ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇల్తిజాకు వెనంటే ఉంటూ కష్టపడి పనిచేసిన పీడీపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన బషీర్ అహ్మద్ షా, ఇల్తిజా ముఫ్తీ కంటే ముందంజలో ఉన్నారు. బీజేపీకి చెందిన సోఫీ యూసిఫ్ మూడో స్థానంలో నిలిచారు.