28-02-2025 09:20:54 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పులిమడుగు గ్రామంలో అక్రమంగా నిలువ ఉంచిన 30 ట్రాక్టర్ల ఇసుకను గుర్తించి శుక్రవారం సీజ్ చేయడం జరిగిందని మండల తహశీల్దార్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండల పరిధిలో ఎవరైనా అక్రమంగా ఇసుక, మట్టి రవాణా చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.