06-03-2025 11:03:10 PM
ఎస్ఐ స్రవంతి...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల శివారులో గురువారం వాహనాలు తనిఖీలు చేపట్టగా అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టుకున్నట్లు దోమకొండ ఎస్సై స్రవంతి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున ముత్యంపేట్ గ్రామంకి చెందిన ముత్తి నవీన్ ట్రాక్టర్ ను పట్టుకొని కేసు నమోదు చేసి, సీజ్ చేసి తహాసిల్దార్ సంజయ్ రావు ముందర బైండోవర్ చేశారని తెలిపారు. మండలంలోని ఇసుక వ్యాపారులు అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని దోమకొండ ఎస్సై హెచ్చరించారు.