22-03-2025 10:24:39 PM
ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఇల్లందు మండల శాఖ ఆధ్వర్యంలో చల్ల సముద్రం గ్రామపంచాయతీ పరిధిలో 1/70 చట్టానికి విరుద్ధంగా వలస గిరిజనేతర్లు నిర్మిస్తున్న అక్రమ ఇండ్ల నిర్మాణాలకు గ్రామపంచాయతీ అనుమతులు ఉన్నాయా లేవా అని ఆర్తీ ఐ యాక్ట్ ద్వారా చల్లసముద్రం పంచాయతీ కార్యదర్శిని కోరారు. ఈ సందర్బంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఇల్లందు మండల అధ్యక్షులు చింత ఉపేందర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో 1970 సంవత్సరం తర్వాత వలస వచ్చిన గిరిజనేతరులు అక్రమ ఇళ్ల నిర్మాణాలు ఏర్పాటు చేసి ఈ ఏజెన్సీ ప్రాంతంలోని మా చట్టాలను నిర్వీయం చేయడమే కాకుండా మా జీవోలను మాకు అమలు కాకుండా కోర్టులను ఆశ్రయించి ఆదివాసుల మనుగడ లేకుండా చేస్తున్న
ఈ వలస గిరిజనేతలకు ఏజెన్సీ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాలు అనుమతులు ఇస్తున్న గ్రామపంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 2011 లోనే వన్ 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతర్లకు కరెంటు మీటర్లు ఇవ్వొద్దని తహసిల్దార్లకు ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ భద్రాచలం మెమో ఇచ్చిన కూడా ఆ మెమో అమలు చేయడంలో గిరిజనేసర అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గోవర్ధన్, మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర కిషోర్, కార్యదర్శి ఈసాల రామచంద్ర, రాకేష్ పాల్గొన్నారు.