calender_icon.png 23 October, 2024 | 3:55 AM

హిందూ సంస్థల కార్యకర్తలపై అక్రమ కేసులు

23-10-2024 02:14:22 AM

రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. వివిధ హిందూ సంస్థల కార్యకర్తలను హింసిస్తూ వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తొలుత  ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు.. సోమవారం అర్ధరాత్రి ఆ ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేసి సెక్షన్ 109 (హత్యాయత్నం) చేర్చారని అన్నారు.   ఇది కుట్రా లేక ద్వేషమా అని ప్రశ్నించారు.  హిందూ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు.