01-04-2025 12:13:35 AM
నిజామాబాద్ మార్చ్ 31 (విజయ క్రాంతి) : అలహాబాద్ ఐఐఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ ఐఐటిలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ మాదాల చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. దివ్యాంగుడైన రాహుల్ జేఈఈ మెయిన్లో ఆలిండియా 52వ ర్యాంక్ సాధించారు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది తన పుట్టిన రోజునే హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు.. సూసైడ్ ముందు ’నాన్న, తమ్ముడిని బాగా చూసుకో అమ్మా..’ అని తల్లి స్వర్ణలతకు మెసేజ్ పెట్టినట్టు కుటుంబ సభ్యులు తెలియచేశారు..