అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి
హుజూరాబాద్, అక్టోబర్ 17 : పట్టభద్రుల ఎన్నికల్లో తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తూ అందరికి అందుబాటులో ఉంటానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నాలుగు జిల్లాలవ్యాప్తంగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిల విడుదలకు కృషిచేస్తానని అన్నారు.
ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలను ప్రభుత్వంతో మాట్లాడి విడుదల చేయిస్తానని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, ప్రతి ఏడాది ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. గతంలో ఎఎ్మల్సీ పదవిని రాజకీయాల కోసమే వాడుకున్నారని ఆరోపించారు.