calender_icon.png 7 March, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలను భయపెడితే జైలుకే

26-01-2025 12:20:52 AM

రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి హెచ్చరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

సిరిసిల్ల జనవరి 25 (విజయ క్రాంతి): ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే జైలుకే పంపిస్థామని, రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు శనివారం సిరిసిల్ల, వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు రకాల నేరాల్లో నిందితులుగా ఉండి రౌడీ షీట్లు,హిస్టరీ షీట్లు , సస్పెకట్స్ గా ఉన్న వారికి కౌన్సిలింగ్ కార్యక్రమం టౌన్ పోలీస్ స్టేషన్ ల లో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.. నేరాల్లో నిందితులుగా ఉండి షీట్లు తెరువబడిన నేరచరితులు విధిగా పోలీసు   తెలిపిన సమయాల్లో పోలీస్ స్టేషన్ హాజరు కావాలని లేని పక్షంలో వారిని బైండోవర్ చేయడం జరుగుతుందన్నారు. రౌడీ, హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

నేరాలకు దూరంగా ఉండటంతో పాటు సత్ప్రవర్తనతో మెదులుతున్న వారిని గుర్తించి వారిపై ఉన్న షీట్స్‌ను తొలగిస్థామన్నారు. రౌడీ హిస్టరీ ఉన్న వారు అనుమానాస్పద, అల్లర్లలో ప్రమేయం ఉన్నవారిని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు.

శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు ఇక్కడ డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, వీరప్రసాద్, ఎస్సైలు  రామ్మోహన్, ప్రశాంత్ రెడ్డి, మారుతి, శ్రీకాంత్, రమాకాంత్, గణేష్, శ్రీకాంత్ లు ఉన్నారు.