29-03-2025 12:28:07 AM
ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలవాలని సూచన
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి28( విజయ క్రాంతి): మళ్లీ జన్మంటూ ఉంటే సాంస్కృతి, సాంప్రదాయాలకు విలువను ఇచ్చే ఆదివాసిగా పుట్టాలని ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషన్ సభ్యులు, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ,ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ,అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఏఎస్పి చిత్తరంజన్ ,డిఎఫ్ఓ నీరజ్ కుమార్ తో కలసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వెనుకబడ్డ ప్రాంతంలో విధులు నిర్వహించడం అదృష్టంగా భావించి గరీబోళ్ల కన్నీళ్లు తుడిచేందుకు సేవా దృక్పథంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు హక్కు ప్రకారం వారికి చెం దాల్చిన పథకాలు అందించడంతో పాటు ఎస్సీ, ఎస్టీలున్న నివాస ప్రాంతాల అభివృద్ధికి సబ్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం సర్పంచ్, ఎంపీటీసీలు లేక పోవడంతో పల్లెల్లో జిల్లా పంచాయతీ అధికారి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి సహకారం అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈనెల 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పోడు భూముల పట్టాలు అర్హులైన వారికి అందించాలన్నారు. పోడు భూముల్లో కాస్తు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ చట్టాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని, ప్రతి నెల 30న మండల స్థాయిలో మీటింగ్ కు తహసిల్దార్ ,ఎస్త్స్ర తోపాటు సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఈ సమా వేశంలో ఆర్డీవో లోకేశ్వరరావు, డి.ఎస్.పి రామానుజం, డిఆర్డిఓ దత్తారావు,గిరిజన సంక్షేమ శాఖ డిడి రమాదేవి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సజీవన్, డిపిఓ బిక్షపతి, సిపిఓ కోటయ్య,ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యు లు, దళిత, గిరిజన సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.