‘ఉషా పరిణయం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో సాయిదుర్గతేజ్
శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఉషా పరిణయం’. ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న కె.విజయ్భాస్కర్ దర్శకత్వంలో లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తాజా చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ఆగస్టు 2న విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హీరో సాయిదుర్గతేజ్ మాట్లాడుతూ.. “తాన్వీకి అన్నయ్యగా ఈ ఫంక్షన్కు వచ్చాను. నాకెంతో ఆప్తుడైన సతీశ్ అన్న కూతురిగానో, మా రెకమండేషన్తోనో ఆమె ఈ చిత్రంలో హీరోయిన్గా చేయటంలేదు. కష్టపడి షార్ట్ ఫిల్మ్స్ చేసి ఈ ఛాన్స్ దక్కించుకుంది. విజయ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ‘ప్రేమ కావాలి’ నేను చేయాల్సింది.. ఆ సినిమాలో నటించే అవకాశాన్ని మిస్సయ్యాను.
కమల్ ఈ మూవీతో హీరోగా మారుతుండటం హ్యాపీగా ఉంది. కొత్తవాళ్లతో చేస్తున్న ఈ చిత్రాన్ని థియేటర్స్కు వెళ్లి చూస్తే ఇలాంటి కొత్త సినిమాలు మరిన్ని వస్తాయి” అని తెలిపారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘14 ఏళ్ల క్రితం సాయిని నేనే హీరోగా పరిచయం చేయాల్సింది, కుదరలేదు. కొత్త టీమ్ను ప్రోత్సహించడానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది’ అన్నారు. హీరో శ్రీకమల్ మాట్లాడుతూ.. “సాయిదుర్గతేజ్కు నేను అభిమానిని. ఆయన ఈ ఈవెంట్కు రావటం ద్వారా జీవితంలో మర్చిపోలేని అనుభూతిని నాకు మిగిల్చారు” అని చెప్పాడు. హీరోయిన్ మాట్లాడుతూ.. ‘నేను సక్సెస్ అవుతుంటే ఆనందించేవారిలో సాయి అన్న ఒకరు. ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చినపుడు నాన్న మొదట మీకే (సాయిదుర్గతేజ్)కే చెప్పాడు. కమల్తో పనిచేయడం కంఫర్ట్గా అనిపించింది. ఆయనలో మంచి నటుడు, డ్యాన్సర్ ఉన్నాడు” అని తెలిపింది.