టెస్లా అధినేత మస్క్
న్యూయార్క్, అక్టోబర్ 28: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మరోసారి అధ్యక్షుడైతే రూ.168 లక్షలు కోట్లు ఆదా అవుతాయని, దీంతో గతంలో ఎప్పుడూ చూడని ఎత్తలకు అమెరికా చేరుకుంటుందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ప్రస్తుత జో బైడెన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో దుబారా ఖర్చులు అధికంగా ఉన్నాయని తెలిపారు.
ట్రంప్ గెలిస్తే ఎలాన్ మస్క్ను కొత్త ప్రభు త్వ పార్లమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ విభాగానికి అధిపతిగా నియమించనున్నట్లు కాంటర్ ఫిట్జ్గెరాల్డ్ చైర్మన్ హోవార్డ్ లుట్నిక్ ప్రక టించారు.
ఇందులో భాగంగా ఆయ న మస్క్ను ప్రస్తుత ప్రభుత్వం అనవసర ఖర్చుల కోసం వృథా చేస్తున్న దాంట్లో ఎంతమేర ఆదా చేస్తారని అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మాస్క్ రూ.168 లక్షల కోట్లు ఆదా చేయొచ్చని పేర్కొన్నాడు. ట్రంప్ మద్దతు దారులు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి పెద్దఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని కోరారు.