హుస్నాబాద్, జూలై 14: హుస్నాబాద్ పట్టణంలోని 18వ వార్డులో మిషన్భగీరథ పైప్లైన్ గేట్వాల్వ్ లీకేజీతో నీరు మురికి కాలువలో కలు స్తున్నది. వార్డు ప్రజలు ఎన్నోసార్లు అధికారులకు సమాచారం అందించి నా స్పందించడంలేదు. గేట్వాల్వ్ లీకైన ప్రాంతంలో మురుగు నీరు మిషన్ భగీరథ నీటిలో కలుస్తున్నా యి. ఆ నీరు ఇంటింటికీ నల్లా ద్వారా సరఫరా అవుతుంది. నీటిని తాగడం తో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు చర్య లు తీసుకోవాలని, లేదంటే ధర్నా చేపడుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.