calender_icon.png 26 October, 2024 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలాగైతే ఇక కుదరదు..

26-10-2024 11:29:40 AM

బెల్లంపల్లి మండల కాంగ్రెస్ లో ముసలం 

రహస్యంగా నాయకులు, కార్యకర్తల సమావేశం

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండల కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. ఒకరిద్దరు నాయకుల వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని మండల కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు, కార్యకర్తలు గుస్సా అవుతున్నారు. ఒకరిద్దరు నాయకుల తీరుతో కలత చెందిన కాంగ్రెస్ శ్రేణులు ఒక రహస్య ప్రాంతంలో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ కోసం 30 ఏళ్లుగా సేవలందించిన నిజమైన కార్యకర్తలకు ప్రోటోకాల్ విషయంలో సముచిత గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ గ్రామాల అభివృద్ధికి నిధులను మంజూరు చేసినప్పటికీ ఒకరిద్దరు నాయకులు అధికారులను మచ్చిక చేసుకుని తమ అనుయాయులకు పనులను అప్పజెబుతున్నారని ఆవేదన చెందారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా తాము చెప్పిందే నడవాలని అహంకార దోరనితో వ్యవహరిస్తున్నారని కలత చెందారు. సదరు నాయకుల వ్యవహార శైలిని ఎమ్మెల్యే వినోద్ దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఈ రహస్య సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూరిబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి.అఫ్జల్, మాజీ ఎంపీపీ సుధమల్ల వెంకటి, మండల మాజీ ఉపాధ్యక్షులు భాకం మల్లేష్, మాజీ ఎంపిటిసి ఎం .మహేందర్, గుమ్మడి నరసయ్య, బూట్ల వెంకటలక్ష్మి, మాజీ సర్పంచులు బరిగల రఘు, జుమ్మి డి బానయ్య, మంద అనిత లతో పాటు నాయకులు డోలుకాజ్ సత్తన్న, బాలకృష్ణ, ముత్తే మురళి, గుమాస శ్రీకాంత్, సత్యనారాయణ గౌడ్, జక్కం తిరుపతి, దుర్గం రవి, యాదండ్ల బాలు, అచ్చ శివ,ముత్యే నవీన్ లు పాల్గొన్నారు.