ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ సవాల్
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశంలోని 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోని ప్రజలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తే.. తాను బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని ఆప్ అధినేత కేజ్రీవాల్ పేర్కొన్నా రు. తమ డిమాండ్ను నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధమేనా అని మోదీకి సవాల్ విసిరారు.
ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన జనతా కీ అదాలత్ పేరుతో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్లు అంతటా విఫలమయ్యాయ ని, హర్యానా, జమ్మూకశ్మీర్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని జోష్యం చెప్పా రు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలంటే.. ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగమేనంటూ మండిపడ్డారు. ఢిల్లీలో హోమ్ గార్డుల వేతనాలను నిలిపివేసిందన్నా రు. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యం లేదని, అక్కడ ఎల్జీ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.