calender_icon.png 28 October, 2024 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోతే పోనీ.. ఉన్నోడే మనోడు

13-07-2024 01:19:41 AM

  • పార్టీ శ్రేణులు వాళ్ల గురించి పట్టించుకోవద్దు: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): రోజుకో ఎమ్మెల్యే దూరమైతున్నా కానీ క్యాడర్ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, పార్టీలో ఉన్నోడే మనోడు అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నట్లు తెలిసింది. పార్టీని వీడే నాయకుల గురించి శ్రేణులు ఆలోచించవద్దని ఆయన సూచించారు. ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న కాలంలో తాను ఒక్కడినేనని, ఇప్పుడు కూడా అదే విధంగా భావించి ప్రజల్లోకి వెళ్లి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులంతా నడుబిగించాలని పేర్కొన్నారు.

అయితే పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన గతంలో ఇచ్చిన అపారమైన అధికారాలే ఇప్పుడు వారిని పార్టీకి దూరం చేస్తున్న ట్టు బీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లా లో కలెక్టర్ మొదలుకుని రెవెన్యూ, కిందిస్థాయి అధికారుల వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే  లు చెప్పినట్లుగా నడుచుకో వడం గతంలో రివాజుగా మారింది. దాంతో అపరిమితమైన అధికారం చెలాయించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు, అధికారం దూరం కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితే వారి ని పార్టీ వదిలేసేందుకు ఒక కారణమవుతన్నదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.