బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా ఆ పార్టీ నేతలు సరికొత్త ఉపా యం ఆలోచించారు. ఎవరైనా పార్టీ వీడితే గత పదేళ్లలో వారు చేసిన బాగోతాలు బయట పెతామంటూ బెదిరింపులకు తెరతీశారు. తమ పాలనలో అక్రమాలకు పాల్పడినా తమ నాయకులేనని చూసిచూడనట్టు వ్యవహరించామనీ, ఇప్పడు పార్టీని వీడితే గతంలో దోచుకున్న సొమ్మును కక్కిస్తామని హెచ్చరిస్తున్నారు. నమ్మిన పార్టీకి ద్రోహం చేయకుండా అధినేత ఆదేశానుసారంగా నడుచుకుంటే తప్పులు దాచిపెడుతామని చెప్తుండటం గమనార్హం. జెండా మారితే గతంలో చేసిన అవినీతి బాగోతాలను బట్టబయలు చేస్తామని బ్లాక్మెయిల్కు దిగుతున్నారు ప్రతిపక్ష పార్టీ సీనియర్లు. దీంతో ఒక పక్క అధికారం పక్షం బెదిరింపులు, మరో వైపు సొంత పార్టీ బ్లాక్మెయిల్తో ముందుకు వెళ్లలేక, ఉన్నదాంట్లో ఇమిడలేక కొంత మంది ఎమ్మెల్యేలు ఫామ్హౌస్లకే పరిమితమవుతున్నారు. ఉన్న వ్యాపారాలు, కాంట్రాక్టర్లను కాపాడుకునేదెట్లా? అంటూ లోలోన మథనపడుతున్నారు.