15-04-2025 12:00:00 AM
కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట నాయకుడు దొనకొండ రమేష్
తుంగతుర్తి, ఏప్రిల్ 14 ః మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటే చరిత్రహీనుడైనని కాంగ్రెస్ పార్టీ రా ష్ర్ట నాయకులు దొనకొండ రమేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జానారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ర్టం కోసం పదవులను త్యాగం చేసిన చరిత్ర కోమటిరెడ్డి బ్రదర్స్ ది అని, జానారెడ్డి మంత్రి పదవుల కోసం లెటర్స్ సిఫార్సు చేయడం సరికాదని విమర్శించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా బరిలో నిలిచి గెలిచారని, తర్వా త స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు బరిలో లేకపోవడంతో రాజగోపాల్ రెడ్డి సతీమణిని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడిన చరిత్ర రాజగోపాల్ రెడ్డిది అన్నారు. అధికారంలో లేనప్పు డు జానారెడ్డి పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలని, జానారెడ్డి కుమారుల రాజకీయ లబ్ధి కోసమే పార్టీని వాడుకున్నారని దేవ చేశారు.