calender_icon.png 17 October, 2024 | 7:56 AM

జైలుకు పంపితే వచ్చి మంత్రిని అవుతా

17-10-2024 01:40:38 AM

నేషనల్ హెరాల్డ్ కేసు తర్వాత అలాగే జరిగింది

చిట్‌చాట్‌లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): 1989లో నేషనల్ హెరాల్డ్ కేసులో జైలుకు వెళ్లొచ్చాక మంత్రిని అయ్యానని, ఇప్పుడు మళ్లీ జైలుకు పంపితే వచ్చి మళ్లీ మంత్రిని అవుతానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. అద్దె చెల్లించాలేదని గురుకులాల బిల్డింగులకు యజమానులు తాళాలు వేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీఆర్‌ఎస్‌లో అసలు అపొజిషన్ లీడర్ ఎవరి ప్రశ్నించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.