26-03-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (విజయక్రాంతి): ఎంఎంటీఎస్ రై ఈ నెల 22న రాత్రి ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు గుర్తించారు. రైల్వే ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. జీఆర్పీ, సైబరాబాద్, ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసులు 13 బృందాలతో గాలించారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మధ్య 28 కిలో మీటర్ల మేర 15 రైల్వే స్టేషన్లలోని సీసీ కెమెరాలను పరిశీలించి.. కేసును ఛేది ంచారు. అల్వాల్ వద్ద మహిళా కోచ్లో కి నిందితుడు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.