ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశైలం
నిర్మల్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): నిజమైన తెలంగాణ ఉద్యమకారులను ప్రభు త్వం గుర్తించి, ఆదుకోవాలని తెలంగాణ ఉ ద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసర్ల శ్రీశైలం కోరారు. ఆదివారం నిర్మల్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మీ య సమ్మేళనంలో మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, కవులు, రచయితలు, కార్మిక సంఘాల పోరాటంతోనే రాష్ట్రం వచ్చిందన్నారు.
ప్రత్యేక తెలం గాణలో గత ప్రభుత్వం ఉద్యమకారులకు సరియైన గుర్తింపు ఇవ్వడంలో వైఫల్యం చెంది దన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యమకారులు గాజు ల రవికుమార్, డాక్టర్ కృష్ట్రంరాజు, చంద్రశేఖర్, మనోజ్యాదవ్, కిరణ్, ప్రశాంత్ పాల్గొన్నారు.