రాజేంద్రనగర్, అక్టోబర్ 1: శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు, ఎస్వోటీ పోలీసులు ఓ కంపెనీలో దాడులు నిర్వహించారు. గడువుతీరిన, నాసిరకం పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ సింప్లెక్స్ సాతంరాయిలోని బాలాజీ ఇండస్ట్రీస్లో మంగళవారం దాడులు నిర్వహించారు. గడువు తీరిన, నాసిరకపు 35 కిలోల పసుపు, 1.5 కిలోల కెచప్, చిల్లీసాస్ 44 లీటర్లు, టొమాటో సాస్ 7 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు.