25-03-2025 01:22:55 AM
మహబూబ్ నగర్, మార్చి 24 (విజయ క్రాంతి) : విద్యార్థుల ఆలోచనలు అద్భుతంగా ఉండాలని అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణం లోని ప్రభుత్వ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలను దేశ్ పాండే ఫౌండేషన్ బృందంతో కలిసి సందర్శిం చడంతోపాటు తన సొంత నిధులతో నియోజకవర్గంలోని మహిళలకు గృహిణులకు మహబూబ్ నగర్ ఫస్ట్ - నవరత్నా లు కార్యాలయం శిక్షణా కేంద్రం లో బ్యూటీషన్, కంప్యూటర్ ఫ్యాషన్ డిజైనింగ్ లలో ఉచితంగా శిక్షణను పొందుతున్న వారికి స్టడీ మెటీరియల్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణం లో ఉన్న రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా తెలంగాణ రాష్ట్రం లోని డిగ్రీ కళాశాల లో ప్రథమ స్థానంలో నిలపాలన్నదే తన ఆశయం అని ఆయన చెప్పారు. చివరి సంవ త్సరం డిగ్రీ చదువుతున్న 500 విద్యార్థులకు మందికి దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రీజనింగ్, ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ లలో శిక్షణ ఇస్తారని, వారు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఏదేని సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ్ పాండే ఫౌండేషన్ వారి శిక్షణ మీకు ఉపయోగపడుతుంది అని ఆయన స్పష్టం చేశారు.
మహబూబ్ నగర్ విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదని, ఎందులోను తగ్గరని, వారిలో ఎంతో శక్తి దాగి ఉందని ఆయన చెప్పారు. మీకు కావల్సిన అన్ని వసతులు సౌకర్యాలు నేను కల్పిస్తానని, మీకు ఎలాంటి ఆర్థిక భారం ఉండదని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ లో జరిగే మొదటి బ్యాచ్ ను పైలెట్ బ్యాచ్ గా ఎంచుకోవాలని దేశ్ పాండే ఫౌండేషన్ ప్రతినిధులను తాను కోరానని దానికి వారు ఒప్పుకున్నారని ఆయన తెలిపారు.
బాహ్య పరిజ్ఞానం లేకపోతే పోటీ ప్రపంచంలో వెనకబడి పోతామని అం దుకే దిన పత్రికలను ప్రతిఒక్కరూ విధిగా చదువాలని ఆయన సూచించారు. దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అందరూ వినియో గించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఒక రోజు జాతీయ సదస్సు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, దేశ్ పాండే ఫౌండేషన్ బృందం ప్రవీణ్ ముత్యాల, శేఖర్, విశ్రాంత ప్రిన్సిపాల్ మురళీమోహన్, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రోఫెసర్ వి.రాజేంద్రప్రసాద్, నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.