- జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఖర్గే
- అస్వస్థతతో వేదికపై పడబోయిన కాంగ్రెస్ చీఫ్
జమ్ముకశ్మీర్, సెప్టెంబర్ 29: మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అలసిపోనని, తాను అప్పుడే చనిపోనని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కథువా జిల్లాలో నిర్వహించిన సభలో ప్రసంగిస్తుండగా ఖర్గే కళ్లు తిరిగి కిందపడబోయారు. దీంతో అక్కడున్న నేతలు ఖర్గేను కింద పడకుండా పట్టుకున్నారు.
అనంతరం ఆయన నీళ్లు అందించారు. తర్వాత ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు. అంతసేపు పార్టీ నేతలు ఆయనను పట్టుకుని నిల్చున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా మళ్లీ తెస్తామని చెప్పారు. రాష్ట్ర హోదా కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కాగా, ఖర్గే వేదికపై నుంచి పడబోయిన దృశ్యాలు వైరల్గా మారాయి.