హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో వస్తున్న తొలిచిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్గా ‘మొరాకో మగువా’, సెకెండ్ సింగిల్గా ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ విడుదలయ్యాయి. తాజాగా థర్డ్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. ‘వస్తాను వస్తానులే..’
అంటూ సాగే ఈ పాటకు చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. ఈ గీత సాహిత్యాన్ని వెంగి రాయగా, కపిల్ కపిలన్ పాడారు. ఈ పాటలో గోపీచంద్, కావ్యాథాపర్ కెమిస్ట్రీ మెస్మరైజింగా ఉంది. ఈ చిత్రానికి కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ కాగా, గోపీ మోహన్ స్క్రీన్ప్లే రాశారు. అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది.