హీరో రవితేజ తమ్ముడైన రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రాన్శర్మ హీరోయిన్. దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి జేజేఆర్ రవిచంద్ నిర్మాత. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఆదివావారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘రవితేజ గారు ఇండస్ట్రీలో ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు.
నన్ను కూడా ఆయన ప్రోత్సహించారు. మాధవ్ను సపోర్ట్ చేయడం నా బాధ్యతగా భావించి ఫంక్షన్కు వచ్చాను. సీసీఎల్కు వెళ్లినప్పుడు రఘు గారు ఒక సాంగ్ చూపించారు. చాలా బాగుంది.. ఎవరు హీరో అంటే మా అబ్బాయి అని చెప్పారు. టైటిల్ మిస్టర్ ఇడియట్ అని చెప్పగానే నాకు ఇడియట్ సినిమా చూసిన రోజులు గుర్తొచ్చాయి.
నేను కూడా చంటిగాడిలా ఫీలయ్యేవాడిని. మాధవ్ సినిమాకు మిస్టర్ ఇడియట్ అనే పేరు పెట్టడం బాగుంది’ అని తెలిపారు. ఎడిటర్ విప్లవ్ నైషధం, సినిమాటోగ్రాఫర్ రామ్రెడ్డి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, చిత్రబృందం పాల్గొన్నారు.