బాలీవుడ్ బ్యూటీగా మంచి పేరు సొంతం చేసుకున్న అనన్య పాండే.. చుంకీ పాండే కూతురుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తాజాగా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య పాండే.. తన అందం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టింది.
తాను అందంగా కనిపించడానికి కావాలనే ఏడుస్తానని చెబుతోందీ ముద్దుగుమ్మ. ‘నాకు ఏడుపు అంటే ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు నా సోషల్ మీడియాలో కూడా నేను ఏడ్చే ఫొటోలు పెడతాను. కన్నీటితో నిండిన కళ్లు నా సహజమైన అందాన్ని నా ముఖంలో మెరుపును తీసుకొస్తాయి. మామూలుగా ఉన్నప్పటి కంటే నేను ఏడుస్తున్న ప్పుడు ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తాను.
చాలా సార్లు ఏడుస్తూ అద్దంలో నన్ను నేను చూసుకుంటా.. సాధారణంగా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేను. ఆటోమేటిగ్గా కన్నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఆ కన్నీళ్లే నా అందాన్ని రెట్టింపు చేస్తున్నా యి’ అని తెలిపింది. అనన్య పాండే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.