ఎమ్మెల్యే యెన్నెం
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): మూసీ పక్కన ఉండి రోగాలబారిన పడిన వాళ్లను కాపాడాలన్న ఆలోచన గత పాలకులకు ఎప్పుడూ రాలేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. మూసీ పక్కన ఉండే వాసన, ఆ బాధ ఎంటో తనకు తెలుసని, తాను కూడా గతంలో మూసీ పక్కన నివాసం ఉన్నానని తెలిపారు. కేటీఆర్ మాత్రం ఇటలీ నుంచి వచ్చే నీళ్లు తాగుతున్నారని ఆరోపించారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మూసీ పక్కన ఉంటున్న వాళ్ల శరీరంలో హెవీ మెటల్స్ ఉన్నట్టు తేలిందని, చిన్న పిల్లలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన గాలి అందివ్వడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.