calender_icon.png 27 October, 2024 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంగ్రాట్స్ చెబితే కానీ తెలియలేదు

27-10-2024 12:00:00 AM

సినీ ఇండస్ట్రీలో రూమర్స్‌కు కొదువే ఉండదు. ఖర్మకాలి కలిసి కనిపించారా.. ఇక అంతే వారిద్దరి మధ్య ఏడో నడుస్తోందంటూ పుకార్లు బయలుదేరుతాయి. ప్రియాంక మోహన్ విషయంలోనూ అదే జరిగింది. అమ్మడు వరుస ప్రాజెక్ట్స్‌తో క్షణం తీరిక లేకుండా ఉంటే.. జయం రవితో ఏకంగా నిశ్చితార్థం జరిగిందంటూ పుకారు వచ్చేసింది. సోషల్ మీడియాలో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మోహన్ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. “జయం రవి, నేను ‘బ్రదర్’ సినిమా కోసం కలిసి పని చేశాం. ఈ సినిమాలో మేమిద్దరం మెడలో పూలదండలు వేసుకున్న ఫోటోను చిత్ర బృందం ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసింది. అది చూసి మాకు ఎంగేజ్‌మెంట్ అయిందంటూ ప్రచారం చేశారు. నేను వరుస షూట్స్‌తో బిజీగా ఉండటంతో అవన్నీ నేను చూడలేదు.

నా స్నేహితులు నాకు కాల్స్ చేసి కంగ్రాట్స్ చెబితే కానీ ఏం జరుగుతోందనేది నాకు తెలియలేదు. పూర్తి విషయం వెంటనే తెలుసుకుని అది కేవలం సినిమా కోసం తీసుకున్న స్టిల్ అని చెప్పాను. ఆ తరువాత వేరే ఏదైనా ఫోటోను విడుదల చేయవచ్చు కదా..

దీనినెందుకు విడుదల చేశారని చిత్రబృందాన్ని తిట్టుకున్నా” అని ప్రియాంక మోహన్ తెలిపారు. ఈ ముద్దుగుమ్మ నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ‘సరిపోదా శనివారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో తెలుగులో ఓజీ, కోలీవుడ్‌లో ‘బ్రదర్’ చిత్రాలున్నాయి.