యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్లో దర్శకుడు సాహిత్ మోత్కూరి తెరకెక్కించిన చిత్రం ‘పొట్టేల్’. నిశాంక్ రెడ్డి కుడితి, సురేశ్కుమార్ సడిగే నిర్మాణ సారథ్యంలో అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ శనివారం సక్సెస్ మీట్ను నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో యువ మాట్లాడుతూ.. ‘సినిమా చూసినవాళ్లందరూ నేను కొత్త యాక్టర్లా కాకుండా అనుభవం ఉన్న నటుడిగా చేశానని చెప్పారు. ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్. ఆడియన్స్ సపోర్ట్ ఇంకా కావాలి’ అన్నారు. హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. “నన్ను ఆడియన్స్ బుజ్జమ్మ అని పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
‘మాతృదేవోభవ’కి ఎలా కనెక్ట్ అయ్యారో ఈ సినిమాకీ అలానే కనెక్ట్ అవుతారు” అన్నారు. డైరెక్టర్ సాహిత్ మోత్కూరి మాట్లాడుతూ.. ‘సినిమాకు 80 శాతం రివ్యూలు పాజిటివ్గా వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివ్ ఏ చిత్రానికీ రాలేదు. ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నా. ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అన్నారు. యాక్టర్ నోయల్, ప్రొడ్యూసర్ సురేశ్, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.