calender_icon.png 27 September, 2024 | 9:39 AM

గుండ్లపోచంపల్లి చెరువులపై హైడ్రా నజర్

27-09-2024 02:57:11 AM

ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను పరిశీలించిన అధికారులు

మేడ్చల్, సెప్టెంబర్ 26: మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణకు గురైన చెరువులపై హైడ్రా దృష్టి పెట్టింది. హైడ్రా బృందం గురువారం నారాయణ చెరువు, సుమారు చెరువులను పరిశీలించింది. గుండ్ల పోచంపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న నారాయ ణ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లు ఎంత ఉన్నాయి. ఆక్రమణలు ఎంతవరకు ఉన్నా యో అధికారులు పరిశీలించారు. సుమారు చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కొంపల్లి మున్సిపాలిటీ పరి ధి ఉంది. ఈ చెరువులో కూడా ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు ఆక్ర మణకు పాల్పడినట్లు సమాచారం. హైడ్రా అధికారుల వెంట స్థానిక మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులున్నారు. త్వరలో ఆయా చెరువుల పరిసరాల్లో కూల్చివేతలుంటాయని ప్రచారం జరుగుతోంది.