హైదరాబాద్: కూల్చివేత వ్యర్థాలు తొలగించేందుకు హైడ్రా టెండర్లు పిలుపునిచ్చింది. నేటి నుంచి ఈ నెల 27 వరకు హైడ్రా బిడ్లు స్వీకరించనుంది. హైడ్రా అధికారులు ఆఫ్ లైన్ లో టెండర్లను ఆహ్వానించారు. ఇప్పటివరకు 23 చోట్ల 262 నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. చెరువులు, కుంటలు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను తీసుకోచ్చింది.