calender_icon.png 23 October, 2024 | 3:58 AM

కమ్యూనిస్టులతోనే హైదరాబాద్‌కు స్వాతంత్య్రం

12-09-2024 01:59:15 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్/నిర్మల్, సెప్టెంబరు 11 (విజయక్రాంతి): కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం లో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితంగానే నాటి హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్య్రం వచ్చిందని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా బుధవారం సీపీఐ జి ల్లా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం బద్ధం ఎ ల్లారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కమ్యూనిస్టుల పోరాట ంతోనే హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చిందన్నారు. నిర్మల్‌లో సీపీఐ ఆధ్వరయలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జిల్లా కార్యదర్శి విలాస్ ప్రాంరంభించారు.