calender_icon.png 24 April, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ హబ్

16-04-2025 01:32:52 AM

  1. 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్
  2. గతేడాది దేశంలోనే అత్యధికంగా 56% వృద్ధి
  3. సిటిజెన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ హబ్ గా మారిందని, అందుకు అనుగుణంగానే కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ పెరిగిందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. భాగ్యనగరంలో 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఏ కమర్షియల్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న ట్టు వివరించారు.

నానక్ రాంగూడలో మంగళవారం యూఎస్‌కు చెందిన సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నా లజీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న సిటిజెన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..  ఢిల్లీ, చెన్ను లాంటి మెట్రో నగరాల్లో కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ తగ్గుతుంటే మన దగ్గర గతేడాది దేశంలోనే అత్యధికంగా 56 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదైందని తెలిపారు.

గతేడాది రిటైల్ రంగంలో 1.8 మిలియన్ చదరపు అడుగుల స్పేస్‌ను వివిధ సంస్థలు లీజుకు తీసుకున్నాయన్నారు. హైదరాబాద్‌లో ఆమ్జెన్, గ్లోబల్ లాజిక్, ఎలీ లిల్లీ, మారియంట్, సిగ్నా లాంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన 355 జీసీసీలు 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయని చెప్పారు.

ఏడాది వ్యవధిలో 70కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయని స్పష్టం చేశారు. వాటిని ఇన్నోవేషన్, ఆర్‌అండ్ డీ, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ తదితర అంశాల్లో సేవలు అందించే గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. 

పెట్టుబడులపై పనిగట్టుకొని దుష్ప్రచారం

2030 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి.. యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని వివరించారు. కొందరు కావాలనే పనిగట్టుకొని పెట్టుబడులు రాకుండా దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వంపై నమ్మకంతో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారని, వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. తమ జీసీసీని హైదరాబాద్‌లో ఏ ర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సిటిజెన్స్ ఫైనాన్షియ ల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం వేయిమంది ఐటీ, డేటా ని పుణులకు ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రెం డు, మూడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని చెప్పా రు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, హె డ్ ఆఫ్ ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ, సెక్యూరిటీ మైకెల్, కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ - అమెరికా సూర్య పాల్గొన్నారు.