హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ... డీజే శబ్ధాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, డీజేలతో నివాసాల్లో వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని సీపీ పేర్కొన్నారు.
పబ్ లలో నృత్యాలు చేసినట్లే ర్యాలీల్లో చేస్తున్నారని, దీంతో డీజే శబ్ధాలు కట్టడి చేయాలని అనేక సంఘాలు ఫర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందరి అభిప్రాయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు, అనిల్ కుమార్ యాదవ్, రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు హాజరయ్యారు.