15-04-2025 03:11:20 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): హుజురాబాద్ హాకీ క్లబ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సాధిక హై స్కూల్ క్రీడా మైదానంలో అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ గుడ్డేలుగుల సమ్మయ్య ఆధ్వర్యంలోనూతన కమిటీని ఎగగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తోట రాజేంద్రప్రసాద్, సెక్రటరీగా బొడిగ తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులుగా భూసారపు శంకర్, ఆరేలిరమేష్, వేముల రవి కుమార్, డి యూసుఫ్, జాయింట్ సెక్రెటరీగా శ్యాంసుందర్, సిహెచ్ రాజు, జి ప్రదీప్, ఎన్ సాయి కృష్ణ, ట్రెజరరిగా ఏం రాజేష్, ఆర్గరైజింగ్ సెక్రటరీగా కే రాజేష్, ఎస్ విక్రమ్, యు భాస్కర్ రెడ్డి, ఏం వినయ్, పి సాంబరాజు, కోచ్గా ఎం విక్రమ్, సలహాదారులుగా జి.సమ్మయ్య, పవన్ కుమార్, బీ రఘు, సిహెచ్ శ్రీనివాస్, కే బిక్షపతి, ఈ జాని, ఎన్ బాలరాజు, కార్యవర్గ సభ్యులుగా పరబ్రహ్మం, సన్నీ, వినీత్, విపుల్, రోహన్, రాజకుమార్, వంశీ, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు తోడ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా హాకీ కి తోడ్పాటు అందిస్తూ అనేక టోర్నమెంట్లు నిర్వహించామన్నారు. టోర్నమెంట్లు నిర్వహించేందుకు హాకీ అభివృద్ధికి పాటు పడతానన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు సజ్జు తో పాటు తదితరులు పాల్గొన్నారు.